గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శనివారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కలుసుకున్నారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్చరీ కాంపిటీషన్స్ కి చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఈ కాంపిటీషన్స్ విజయవంతంగా ముగిసిన సంధర్భంగా ఆర్గనైజ్ చేసిన టీం ను ప్రధాని మోడీ అభినందించారు.ఈ కాంపిటీషన్స్ ను చరణ్ మామగారు అనిల్ కామినేని లీడ్ చేసారు.చరణ్, ఉపాసన, అనిల్ కామినేని ప్రధాని మోడీ ని కలిసారు.. క్రీడా పోటీలు నిర్వహించిన తీరు కు మోడీ అభినందనలు తెలిపారు..ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశం లో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న తీరు గొప్పగా ఉంది అని చరణ్ ట్వీట్ చేశారు




